మద్యం సిండికేట్ లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లు
Publish Date:Jun 18, 2012
Advertisement
ఎప్పటినుంచో మద్యం వ్యాపారంలో ఉన్నా బయటికిరాని కొత్త పాత్రలు ఇప్పుడు పరిచయమవుతున్నాయి. పాటజాబితాలో పాత్రధారులుగా ఉన్న ఇద్దరు సిండికేటు వాటాదారులు ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఉపఎన్నికల్లో గెలుపొందారు. దీంతో సిబీఐ జాబితాలోని రాజకీయనాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అలానే గుంటూరు జిల్లాలో ఎసిబి వలేసి పట్టుకున్న నారాకోడూరు మద్యం సిండికేటు నిర్వాహకుడు జమ్ముల ఉమామహేశ్వరరావును విచారిస్తే ఆయన కూడా కొన్ని కొత్తపాత్రల వివరాలు కక్కారట. దీంతో ఈ మద్యం వ్యవహారం కొన్ని కీలకమైన మలుపులు తిరుగుతోంది. ఎం.ఆర్.పి. కన్నా అధికధరలకు మద్యం అమ్మకాలు జరిపిన కేసులో ఎసిబి కొంత పురోగతి సాధించింది. ప్రస్తుతం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావులను ఎసిబి డిఎస్పీలు విచారిస్తున్నారు. అయితే వీరి వెనుకే నిందుతుల జాబితాలో ఉన్న చెన్నకేశవరెడ్డి, నరసన్నపేటకు చెందిన కృష్ణదాసు ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిని కూడా విచారించనున్నారు. గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన జమ్ముల ఉమామహేశ్వరరావు ఎం.ఆర్.పి. ధరలకన్నా అధికరెట్లకు మద్యం విక్రయించిన సిండికేట్లలో ప్రముఖుడు. ఇతనికి ఇక్సైజ్ శాఖతో సత్సంబంధాలున్నాయి. ఎసిబి ఈ కేసు విచారిస్తోందనీ, దానిలో ఉమామహేశ్వరరావు పేరు కూడా ఉందని సమాచారం అందుకున్న వెంటనే ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. చాలాకాలం కనిపించకుండాపోయిన ఉమామహేశ్వరరావు తన సంగతి అందరూ మరిచి ఉంటారని ఇటీవల బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే ఎసిబి ఆయన్ని చాకచక్యంగా అరెస్టు చేసింది. ఆయన్ని విచారించగా చేబ్రోలుకు చెందిన ఓ చోటానాయకుని వివరాలు ,నారాకోడూరు ఎక్సైజ్ కానిస్టేబుల్, ఓ కాంగ్రెస్ నాయకుడి వివరాలు కక్కేశారు. వీరందరూ సిండికేటు వాటాదారులు. ఉమామహేశ్వరరావు ఎసిబి కోర్టులో హాజరుపరిస్తే ఆయనకీ 14రోజుల రిమాండు విధించింది. ఇటీవల ఇదే జిల్లాలోని పొన్నూరులో మద్యం వ్యాపార్య్లపై ఎసిబి దృష్టిసారించింది. అలానే ములుకుదురు సాయి బీర్ అండ్ వైన్స్ యజమాని అన్వర్ గౌడ్ తెల్లకార్డును రెవెన్యూ అధికారులు క్యాన్సిల్ చేశారు. ఉమామహేశ్వరరావు రిమాండు ఎసిబి విచారణ గుంటూరు జిల్లాలోని మద్యం సిండికేట్లను వణికిస్తోంది. ఎసిబి పేరు వింటేనే వ్యాపారులు భయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/-ap-liquor-syndicate-24-14969.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





