మినరల్ కెమిస్ట్రీ చదివితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇస్తారా?
Publish Date:Jun 20, 2012
Advertisement
పీజీ చేసి ప్యూన్ గా ఉద్యోగం సరిపెట్టుకునే ఈ రోజుల్లో ... మినరల్ కెమిస్ట్రీ చదివి ఆక్నూ (ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ)లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసున్న ఒక వ్యక్తి వైనం ఇది. గత విద్యాసంవత్సరం క్లాసులు ముగిసేసమయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆక్నూలో అనదికార్ల ప్రొఫెసర్ల దందా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం పదేళ్ళు పూర్తి చేయకుండానే పి.హెచ్.డి. పూర్తయినట్లు నేరుగా ప్రొఫెసర్ హోదాలు ఇక్కడ కల్పించారు. అయితే ఈ హోదా ఎవరు కల్పించారన్న అంశంపై విసితో కలిసి విచారణ కమిటీ తెలుసుకుంటోంది. రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆదినుంచి సమస్యలతోనే ప్రారంభమైంది. ఈ యూనివర్సిటీకి స్థలాన్ని సేకరించిన తరువాత గతేడాదే క్లాసులు ప్రారంభమయ్యాయి. కాకినాడ జె.ఎన్.టి.యు. విసి అల్లం అప్పారావుకు యూనివర్సిటీ అదనపు బాధ్యతలు అప్పగించాక ఆయన విశ్వవిద్యాలుయ స్థలాలను చూసి గదుల నిర్మాణం వేగిరం చేస్తూనే క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత ఈ ఏడాది క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. గతేడాది క్లాసులు ముగింపు సమయంలో వచ్చిన అనధికార ప్రొఫెసర్లు దండా విచారణతో తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి విసి ఉన్నతస్థాయి విచారణ బృందానికి తనకు తెలిసిన సమాచారం ఇస్తూవచ్చారు. అయితే ఆ బృందం జరిగిందేమిటో తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. విసి కూడా ఆ ప్రొఫెసర్లను రప్పించి విషయం కనుక్కుంటున్నారు. పదేళ్ళ సీనియార్టీ చూపేందుకు ఒక ప్రొఫెసర్ తాను మహబూబ్ నగర లోని ప్రైవేటు విద్యాసంస్థలో పదేళ్ళు పనిచేసినట్లు ధృవపత్రాన్ని జతచేయటం కూడా నిబంధనల అతిక్రమణ కిందకే వస్తుంది. దీంతో ఆ ప్రొఫెసర్ తోనూ విసి చర్చించారు. అలానే మినరల్ కెమిస్ట్రీ చదివి ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని విచారించారు. విశ్వవిద్యాలయంలో అన్నీ నిబంధనల ప్రకారం ఉండాల్సిందేనని విసి స్పష్టం చేశారని సమాచారం. విచారణ బృందం నివేదిక ఇచ్చాకైనా ఇటువంటి ఆరోపణలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని విసి నిర్ణయం తీసుకున్నారు.
http://www.teluguone.com/news/content/-aknu-university-24-14999.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





