వీరేశలింగం ఫోటో పెట్టి గురజాడకి నివాళులు అర్పించిన వైకాపా!

 

తెలుగు బాషోద్యమానికి నాంది పలికిన మహాకవి గురజాడ అప్పారావు గారి శత వర్ధంతిని నిన్న భాషాభిమానులు అందరూ చాలా ఘనంగా జరుపుకొన్నారు. వైకాపా కూడా జరుపుకొంది. కాకపోతే గురజాడవారి చిత్రానికి బదులు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారి చిత్రం ప్రచురించి, గురజాడవారికి నివాళులు అర్పించింది. దానిపై స్పందించిన నారా లోకేష్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ట్వీట్ బాణాలు సందించారు. “వైకాపా నేతలకు కుంభకోణాలు చేసేవారిని తప్ప వేరెవరినీ గుర్తించలేరు. జగన్!ఈ చిత్రం కందుకూరి వీరేశలింగం గారిది. క్షమించండి గురజాడ గారు!” అని ట్వీట్ చేసారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu