రేపు తెదేపా తీర్ధం పుచ్చుకోనున్న ఆనం బ్రదర్స్

 

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి బుదవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నారు. వారిలో ఆనం రామనారాయణ రెడ్డి తెదేపాతోనే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేసారు. తరువాత కాంగ్రెస్ పార్టీలోకి మారి డా. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ అద్వానంగా తయారవుతుండటంతో ఆ పార్టీ నుండి చాలా మంది నాయకులు వేరే పార్టీలలోకి వెళ్ళిపోయారు. ఇప్పడు ఆనం వారి వంతు వచ్చింది అంతే! కానీ వారి రాకను నెల్లూరు జిల్లా తెదేపా నేతలు నేటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉన్నందున చంద్రబాబు నాయుడు వారినిరువురినీ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకొన్నారు. రేపు ఉదయం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వారిరువురూ తమ అనుచరులతో కలిసి తెదేపాలో చేరబోతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu