వీధుల్లోనే ఎక్కువ గడుపుతున్న జగన్
posted on Oct 26, 2015 12:09PM
.jpg)
వైకాప అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ కు మరో వార్త పిడుగులా ఆయన మీద పడింది. ఆ పార్టీలోని ఇద్దరు నేతలు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఆలోచించేలోపే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు దీనిపై ఆందోళనలు చేయడానికి బయల్దేరారు వైకాపా శ్రేణులు. అంతేకాదు రాజధాని ప్రాతం తుళ్లూరులోనూ.. ఉద్దండరాయుని పాలెంలోనూ రైతులతో సమావేశం కానున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం జగన్ ను ఇంట్లో కంటే వీధుల్లోనే ఎక్కువ గడిపేలా చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. దానికి జగన్ ఆందోళనలు.. నిరసనలు అంటూ వీధులకెక్కడం ఇదే సరిపోతుంది. మరి పార్టీ గురించి ఎప్పడు ఆలోచిస్తాడు.. పార్టీ బలోపేతానికి ఏం చేస్తాడు అని పలు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.