స్పీకర్ కోడెలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారు..
posted on May 1, 2016 12:15PM
.jpg)
వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరగా.. ఇంకా మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. వైయస్సార్ కాంగ్రెస పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 16మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని.. వారిపై అనర్హత వేటు వేయాలని.. పార్టీ ఫిరాయింపులను టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారని .. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఫిర్యాదు చేశారు.