ఈసారి జయలలితకు ఓటమి తప్పదా..? తమిళనాట కొత్త సర్వే..

 

తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం చాలా వాడీ వేడీగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఒకపక్క ఎన్నికల బరిలో సెలబ్రిటీలు ఉండగా, మరోపక్క ఈసారి హిజ్రాలు కూడా పోటీ చేస్తుండటంతో మరి రసవత్తరంగా మారింది. అయితే ఈసారి మాత్రం ముఖ్యమంత్రి జయలలితకు పరాభవం తప్పదని, తదుపరి ప్రజలు డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెన్నై లయోలా కాలేజ్ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. పూర్వవిద్యార్థుల సంఘం సమన్వయకర్త తిరునావుక్కరసు మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 29 నుంచి ఏప్రిల్ 28 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని సర్వేలో భాగంగా ప్రశ్నించామని.. ఈ సర్వేలో జయలలితపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసిందని.. సర్వే వివరాలు తెలియజేస్తూ, డీఎంకేకు 124 సీట్లు లాభించనున్నాయని, అన్నాడీఎంకే 90 స్థానాలకు పరిమితం కానుందని వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu