యాకుబ్ ను ఉరితీసిన తలారికి 10వేల చెక్

 

ముంబై వరుస పేలుళ్ల కేసులో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమెన్‌ను ఉరి తీసిన సంగతి తెలిసిందే. అయితే యాకుబ్ ను ఉరితీసిన తలారికి పదివేల రూపాయల చెక్ ను పంపించారు. కర్ణాటకకు చెందిన అంబికా పదవి పూర్వ విద్యాలయకు చెందిన కొందరు విద్యార్థి నాయకులకు తలారికి పదివేలు చెక్ పంపిస్తూ.. ముంబైలో యాకుబ్ చేసిన మారణ హోమంలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని.. అలాంటి యాకుబ్‌ను ఉరి తీసిన తలారిని గౌరవించడం తమకు చాలా గర్వంగా ఉందని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అందుకే తలారికీ పదివేల చెక్ ను పంపించాలని నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu