రేపిస్టుని లేపేసింది

 

రేపిస్టులకి మరణ దండన విధించడం న్యాయమని చాలామంది అంటూ వుంటారు. అందుకేనేమో తనను రేప్ చేసిన వ్యక్తిని కోర్టు వరకూ తీసుకెళ్ళడం ఎందుకులే అనుకుందా మహిళ... తనను రేప్ చేసిన వ్యక్తిని తానే చంపేసింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగింది. రాంచీలో నివసించే ఒక ఒంటరి మహిళ మీద మనోజ్ కుమార్ అనే కాముకుడు కన్నేశాడు. ఆమెని లోబరుచుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆమె లొంగకపోవడంతో ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణానికి గురైన ఆ మహిళ ఏడుస్తూ కూర్చోలేదు. అక్కడే వున్న సుత్తిని తీసుకుని మనోజ్ కుమార్ తలమీద కొట్టింది. దాంతో ఆ కాముకుడు అక్కడికక్కడే మరణించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu