చెన్నై కి పారిస్ సాయం..

చెన్నైలో భారీ వర్షాల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా అతలాకుతలమైన చెన్నైని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్రాలు కూడా తమవంతు సాయం అందిస్తున్నాయి. ఇప్పుడు ఒక్క రాష్ట్రంలే కాదు దేశాలు సైతం ముందుకొస్తున్నాయి. ఒకపక్క ఉగ్రవాదుల దాడి జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి.. ఇప్పటికీ ఆ భయం నుండి ప్రజలు భయటకి రాకముందే చెన్నైకి సాయం చేయడానికి పారిస్ ముందుకొచ్చింది. ఎక్కడో ఉన్నో చెన్నైకి పారిస్ సాయం అందిచడమేంటి అనుకుంటున్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. చెన్నై వాసులను ఆదుకోవడానికి వారు ఆన్ లైన్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. షేర్ ఫర్ చెన్నై పేరిట విరాళాలు సేకరిస్తున్నారట. అంతేకాదు చెన్నై వాసులకు పారిస్ వాళ్లు భోజనం కూడా త్యాగం చేస్తున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu