ఒక నెల... 289 మంది...

 

ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్ పట్టణం మీద తాలిబన్లు, అమెరికా సైనికులు జరిపిన దాడిలో కేవలం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే 289 మంది పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం... తాలిబన్లు, వారిని అణచివేయడానికి అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో మొత్తం 289 మంది మరణించారు. 559 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా వుండొచ్చు. కుందుజ్‌లో జరుగుతున్న దాడుల వల్ల అక్కడి నుంచి వేలాది కుటుంబాలు వలస వెళ్ళిపోతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu