భర్తని ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన భార్య

 

కరీంనగర్ జిల్లాలో ఓ భార్య తన భర్తని ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేసింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఐడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. భర్త సర్దుకుపోతున్నా భార్య ఆవేశంతో ఊగిపోతూ అక్కడే వున్న ఇనుప రాడ్‌తో భర్త తలమీద ఒక్క వేటు వేసింది. దాంతో ఆ భర్త అక్కడిక్కడే మరణించాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu