చంద్రబాబు పుట్టపర్తి సందర్శన!

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన గురువారం నాడు ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తిని సందర్శించారు. ట్రస్టు సభ్యులు రత్నాకర్, చక్రవర్తి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు శాంతిభవన్ అతిథి గృహంలో ట్రస్టు వర్గాలతో ప్రత్యేకంగా చర్చించారు. ట్రస్టు సేవల గురించి ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. పుట్టపర్తి అభివృద్ధి, సత్యసాయి ట్రస్టుకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలు చేయూతనిస్తానని ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News