రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు.. సీపీఐ కార్యాలయానికి నిప్పు..


పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఎంసీ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. టీఎంసీ కార్యకర్తలు కొంతమంది అసన్సోల్ లో ఉన్న సీపీఐ(ఎం) కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో ఫర్నీచర్ దగ్ధమై పోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, కార్యాలయంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారని, అయితే ప్రేక్షక పాత్రపోషించారని సీపీఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu