69 ఏళ్ల తరువాత ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు..

 

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఐదో విడత ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈనెల 5వ తేదీన చివరి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఇప్పటివరకూ అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్ల వరకూ ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలు సంగతేంటంటే.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతాలను గత ఏడాది ప్రాంతాలను పంచుకున్నాయి. మొత్తం 162 ప్రజా సమూహాల్లో బంగ్లాదేశ్ కు 111, భారత్ కు 51 ప్రజాసమూహాలు వచ్చాయి. దీంతో పశ్చిమబెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాలో 15 సమూహాలకు 9 వేల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. అంతకుముందు వరకూ వారు ఏ దేశానికి చెందినవారో పరిగణించకపోవడంతో ఇన్ని సంవత్సరాలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu