సద్దుమణిగిందనుకున్నారా..ఏపీ, తెలంగాణ వార్ రిటర్న్

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య సోదర బంధం బలపడుతున్న తరుణంలో తాగునీటి ప్రాజెక్ట్ల్‌లు మళ్లీ చిచ్చుబెట్టాయి. నిన్న విజయవాడలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లపై కేంద్రానికి లేఖ రాయాలని..అవసరమైతే న్యాయపోరాటం చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మళ్లీ రెండు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి రాబోతుందని రాజకీయ విశ్లేషకులు ముందుగానే ఊహించారు. అనుకున్నట్టుగానే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లపై ఏపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని..కేబినెట్ తీర్మానం బాధ్యాతారాహిత్య చర్య అని అభిప్రాయపడ్డారు. ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్‌కు సీడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయా? అని ఆయన నిలదీశారు. పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో జగన్‌కు మైలేజీ వచ్చే ప్రమాదం ఉందని భావించే, చంద్రబాబు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరి తలసానికి కౌంటర్‌గా ఏపీలో ఎవరు మాట్లాడుతారో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu