రేపు సాయంత్రంతో ప్రచారం ఆపాలి.. ఇక ఇళ్లలోనే ఉండాలి.. భన్వర్ లాల్

రేపు సాయంత్రం ఐదు గంటల కల్లా వరంగల్ ఉపఎన్నిక ప్రచారం ముగించాలని ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికల పోలింగ్ ఉంటుందని.. అన్నిపోలింగ్ కేంద్రాల్లో సాయుధ కానిస్టేబుళ్ల బలగాలు  ఉంటాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకూ 9  ఫిర్యాదులు అందాయని.. వివరణ కోరుతూ సీఎస్ కు నోటీసులు పంపించామని తెలిపారు. అంతేకాదు స్థానికేతర నేతలంతా రేపు సాయంత్రం 5 గంటల కల్లా జిల్లా విడిచి వెళ్లాలని.. వారు ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ఆదేశించారు. బల్క్ ఎస్ఎంఎస్ లు పంపినా.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా ఫిర్యాదు చేయాలంటూ తెలిపారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu