రోజా ఎస్.. షర్మిళ నో.. జగన్
posted on Nov 13, 2015 2:10PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన చెల్లి షర్మిల అంటే ఎంతొ కొంత భయమనే చెప్పాలి. వైఎస్ జగన్ కు ఉన్న పేరుకు సమానంగా.. ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లో షర్మిలకు బాగానే పేరుంది. అందుకే తన కంటే ఎక్కడ ఎక్కువ పేరు వస్తుందా.. ఎక్కడ ఎక్కువ జనాదారణ లభిస్తుందా అని జగన్ షర్మిళకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆఖరికి తను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా షర్మిలను తన దరికి రానివ్వలేదు జగన్. అయితే ఇప్పుడు మరోసారి జగన్ షర్మిళను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయించుకొని పేరు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వరంగల్ ఉపఎన్నిక ప్రచారానికి మాత్రం షర్మిళను దూరం పెట్టారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో తాను ప్రచారానికి వస్తానని.. ఇంకా జనాకర్షణ ఉన్న నేత కావాలంటే రోజాని తీసుకెళ్లండి అని చెప్పారట.. అంతేకాదు ప్రచారానికి షర్మిళను తీసుకురావడానికి మాత్రం ససేమీరా ఒప్పుకోనని తేల్చిచెప్పాడట. దీంతో టీ వైసీపీ నాయకులకు రోజా తప్ప మరే ఛాయిస్ లేకపోయేసరికి వరంగల్ ప్రచారానికి రోజాని తీసుకెళ్లాల్సివచ్చిందట. ఏది ఏమైనా జగన్ మాట ప్రకారం టీ వైసీపీ నేతలు రోజాని తీసుకెళ్లగా.. రోజా ప్రచారానికి మాత్రం మంచి స్పందనే వచ్చిందని తెలుస్తోంది.