వరంగల్ మాదే... నారాయణఖేడ్ కూడా మాదే...

 

వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... కేసీఆర్ పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెబుతోంది. ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ విధానాల పట్ల 80శాతం పైగా ప్రజలు పాజిటివ్ గానే ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి అన్నారు, దాదాపు 57శాతం ఓట్లతో వరంగల్ ఎంపీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని, అలాగే నారాయణఖేడ్ ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు, విపక్షాలు ఎంత గింజుకున్నా ఉపయోగం లేదని, ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలకు అసలు అభ్యర్ధులే దొరకడం లేదన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి... టీఆర్ఎస్ టికెట్ కో్సం పాతికమంది పోటీపడుతున్నారని అన్నారు.