విజయ్ కి గాయం.. ఎందుకు దాచాడు

కొన్ని లక్షల మంది అభిమానగణం ఇళయ దళపతి విజయ్ సొంతం.ఆయన చిటికేస్తే తమిళనాడు మొత్తం కదిలి వస్తుంది. అంతటి క్రేజ్ ని  రాత్రికి రాత్రే సంపాదించలేదు. రెండున్నర దశాబ్దాల పై నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తు  వస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ పైడ్ రెమ్యునరేషన్ తీసుకునే మొదటి ఐదుగురులో కూడా ఒకడు. తాజాగా విజయ్ కి చెందిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని చూసిన ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.


2004 లో వచ్చిన విజయ్ వన్ మాన్ షో గిల్లి. ఏ ఎం రత్నం నిర్మాతగా ధరణి దర్శకత్వంలో తెరకెక్కింది. రీసెంట్ గా మొన్న  20 వ తేదీ  రీ రిలీజ్ అయ్యింది. తొలి రోజే 15 కోట్ల రూపాయలకి పైన సాధించింది. ఇప్పటికి కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయ్ ని  ఏ ఎం రత్నం  కలిసి శుభాకాంక్షలు తెలియచేసాడు. ఈ మేరకు  ఇద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంది.  ఆ ఫొటోలో విజయ్ చేతికి గాయాలు ఉన్నాయి. పిక్ ని క్లియర్ గా చూస్తే గాయాలు కనపడుతున్నాయి.  దీంతో అభిమానులు ఆందోళన చెంది ఫిలిం సర్కిల్స్ లో ఎంక్వయిరీ చేస్తున్నారు. దీనిపై విజయ్ ఒక ప్రకటన ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు.

విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం  చేస్తున్నాడు.  ఆ సినిమా షూటింగ్ లో గాయమయ్యుంటుందని   అనుకుంటున్నారు.  ఇక ఆ సినిమా షూటింగ్  శరవేగంగా జరుపుకుంటుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుండగా వెంకట్ ప్రభు  దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఇక విజయ్ తమిళ మున్నేట్ర కజగం పేరుతో పొలిటికల్ పార్టీ స్థాపించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యబోతున్నాడు