వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత


వీహెచ్పీ (విశ్వహిందూ పరిషత్) సీనియర్ నేత అశోక్ సింఘాల్ కన్ను ముశారు. గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న సింఘాల్ గుర్గావ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుర్గావ్‌ లోని మేదంతా మెడిసిటీ ఆస్పత్రిలో ఈ రోజు మధ్యాహ్నం 2.24 గంటలకు మృతి చెందినట్లు వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు. అశోక్ సింఘాల్ 20 ఏళ్ల పాటు వీహెచ్పీ కి అధ్యక్షుడిగా పనిచేశారని.. విశ్వహిందూ పరిషత్ విస్తరణకు ఆయన అనేక విధాల కృషి చేశారని ప్రవీణ్ తొగాడియా తెలిపారు. కాగా భారత దేశ విశ్వహిందూ పరిషత్ కు చైర్మన్ గా కోనసాగిన ఆయన అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu