పారిస్ కి పట్టిన గతే పడుతుంది.. ఐఎస్ఐఎస్ హెచ్చరిక
posted on Nov 17, 2015 3:49PM

పారిస్ లో ఉగ్రవాదులు దాడి జరిపి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఎంతో మంది మృతి చెందగా ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా సిరియా దేశంలో జోక్యం చేసుకున్నందుకు.. బుద్ది చెప్పడానికే ఈ దాడి చేశామని ఐఎస్ఐఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క పారిస్ లోనే కాదు ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా తాము దాడులు చేసి తగిన బుద్ది చెబుతామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా దాడులు చేస్తున్న అన్ని దేశాలకు ప్యారిస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఐఎస్ఐఎస్ వెబ్ సైట్ నుండి ఓ వీడియో ద్వారా అల్జెరియన్ అల్ గరీబ్ అనే వ్యక్తి హెచ్చరించినట్టు తెలుస్తోంది. సిరియాలో తమ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో అగ్రరాజ్యాలు వైమానిక దాడులు చేస్తున్నాయని.. తాము త్వరలోనే దాడులు చేసి బుద్ది చెబుతామని హెచ్చరించాడు.