బీసీసీఐ కి సుప్రీం వార్నింగ్..

 

బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా)కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్ననేపథ్యంలో సుప్రీం బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోధా కమిటీ తాము ఇచ్చిన సిఫార్సులను బీసీసీఐ విస్మరించిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి టీఎస్ థాకూర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  బీసీసీఐ పెద్దలు తమకు తామే చట్టమని భావిస్తున్నట్టు అనిపిస్తోందని, వారిలా లోధా కమిటీ సిఫార్సులను పక్కన బెడతారని భావించలేదని ఆయన అన్నారు. ఈ సిఫార్సులకు బీసీసీఐ కట్టుబడి వుండాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu