తెలంగాణలో మరో ఇద్దరు రైతులు...

 

తెలంగాణ రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కాజగూడ గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజు (30)కు ఎకరం పొలం వుంది. మరో ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇటీవల ఆయన వేసిన మొక్కజొన్న, పత్తి పంటలు నీరు లేక ఎండిపోయాయి. దాంతో రాజు ఏడు లక్షల రూపాయల వరకు అప్పులపాలైపోయాడు. దాంతో రాజు పొలం దగ్గరకి వెళ్ళి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన చుంచు లింగయ్య (57) నాలుగున్నర ఎకరాలలో వేసిన పత్తి ఎండిపోయింది. దాంతో లింగయ్య లక్షన్నర రూపాయలు అప్పు పడ్డాడు. అప్పు తీర్చలేననే మనోవేదనతో లింగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu