రిజల్ట్స్ మందు పార్టీ: తప్పతాగిన త్రిష చిందులు

 

 

 

టోటల్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా సూపర్‌గా ఎంజాయ్ చేసిందెవరయ్యా అంటే.. త్రిష అని చెప్పొచ్చు. అదేంటయ్యా అని అడిగితే, శుక్రవారం అంతా ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆసక్తి గా చూస్తూ ఉంటే త్రిషమాత్రం తన స్వస్థలమైన చెన్నైలో కాకుండా హైదరాబాద్‌లో మందు కొట్టి చిందేసినట్టు సమాచారం. వెండితెరమీద నోట్లో వేలుపెటితే కొరకలేనట్టు కనిపిస్తుందిగానీ, రియల్ లైఫ్‌లో త్రిష చాలా ఫాస్ట్. మందుకొట్టి రోడ్డుమీదకి ఎక్కిందంటే ఆమె అల్లరి చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఆ అల్లరి ఆమె మరోసారి హైదరాబాద్‌లో చేసింది. ఓ పక్క ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే మరోపక్క త్రిష ఫుల్లుగా తాగి రోడ్డు మీద ఫ్రెండ్స్ తో కలసి చిందులు వేసింది. త్రిష ఇలా లెటస్ట్ గా తాగి చిందులు వేయడానికి కారణం దేశంలో మోడీ ప్రభంజనం వీస్తున్నందువల్లే అని అనుకోకండి. త్రిషకి అంత రాజకీయ పరిజ్ఞానం, సామాజిక స్పృహ వుండే అవకాశం లేదు.