చివరి ప్రెస్‌మీట్‌లో ప్రధాని మన్మోహన్ సన్నాయి నొక్కులు

 

పదేళ్ళపాటు దేశాన్ని అష్ట దరిద్రంగా, సోనియా ఆధిపత్యంలో పరిపాలించిన ప్రధాని మన్మోహన్ సింగ్ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో వెన్నెముక లేని ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. దేవెగౌడ కంటే అసమర్థుడైన ప్రధానిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తన పదవికి వీడ్కోలు పలికేముందు ఆయన జాతికి సందేశం ఇవ్వడానికి టీవీలో కనిపించారు. చివరికి చివరి సందేశం కూడా సరిగా ఇవ్వడం రాని ప్రధానమంతి మన్మోహన్ సింగ్ ఎదురుగా కాగితం పెట్టుకుని చదువుతున్న రోబోలా కనిపించారే తప్ప ఆయన మాట్లాడిన మాటల్లో, ముఖంలో జీవం లేదు. పదవిలో వున్నంతకాలం బొమ్మలా కనిపించడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. ఇప్పుడు తన చివరి సందేశంలో కూడా అదే వరస. ఇంత నీరసమైన ప్రధానమంత్రిగా నిలిచారు కాబట్టే బీజేపీకి, ఎన్టీయేకి దేశ ప్రజలు అంత భారీ మెజారిటీ ఇచ్చి సాగనంపారు. ప్రధానిగా తన చివరి సందేశంలో ఆయన చెప్పిన మాటలు వింటే బాగా కామెడీగా అనిపించడం ఖాయం. ఈ పదేళ్ళలో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు తీసుకుపోయిందట. అందుకని ఆయన చాలా గర్వంగా ఫీలవుతున్నారట. ఈ మాటలు చెప్పడానికి మన్మోహన్ కొద్దిగా కూడా సిగ్గుపడకపోవడం బాధాకరం. ఒకవేళ ఆయన సిగ్గుపడినా, ఏ భావమూ పలకని ఆయన ముఖంలో ఆ సిగ్గు కనిపించలేదు.