పశ్చిమ బెంగాల్ లో మరోసారి హింస.. నలుగురు మృతి

 

పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల క్రితమే ఐదో దశ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో టీఎంసీ పార్టీ కార్యకర్తలకు, సీపీఎం పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగగా.. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా మాల్దా ప్రాంతంలో హింస చలరేగింది. కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవ జరిగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు టీఎంసీ నేతలు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు బాంబులను విసిరారని, ఈ కారణంతోనే తమవారు మరణించారని తృణమూల్ ఆరోపించగా, కాంగ్రెస్ దాన్ని ఖండించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu