తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ గత కొన్ని రోజులతో పోలిస్తే ఒకింత తగ్గింది. ఆదివారం (జులై 20) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ నారాయణగిరి షెడ్ల వరకూ సాగింది. ఇక టోకెన్లు లేని భక్తలకు శ్రీవారి సర్వదర్శనారికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక శనివారం (జులై 19) శ్రీవారిని మొత్తం 90 వేల 11 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వుల 328 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది.