ఘోర ప్రమాదం.. మట్టిదిబ్బలు పడి ముగ్గురు మృతి

సెల్లార్ తవ్వుతుండగా మట్టిదిబ్బలు పడి ముగ్గురు మరణించిన విషాద ఘటన హైదరాబాద్ లో బుధవారం జరిగింది. ఎల్బీనగర్ లో ఒ హోటల్ సెల్లార్ తవ్వకం పనులు జరుగుతుండగా ఈ ఘోరం జరిగింది.

ఒక్కసారిగా మట్టిదిబ్బలు తవ్వకం పనులలో ఉన్న కార్మికులపై పడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో కార్మికులు గాయపడ్డాడు. మృతి చెందిన కార్మికులు ముగ్గురూ బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu