రావూరి భరద్వాజను వరించిన జ్ఞానపీఠ్ అవార్డు

Telugu writer Dr Ravuri Bharadwaja chosen for Jnanpith award, Ravuri Bharadwaja-gets- Gyanpeeth Award for 2012 year, Telugu writer Ravuri Bharadwaja wins Jnanpith Award

 

86 ఏళ్ళ ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త రావూరి భరద్వాజ తన సాహితీ ప్రస్థానంలో ఇప్పటివరకు 37కు పైగా కథల సంపుటాలు, 17 నవలలు రాశారు. సినిమా (అథో)జగత్తుపై ఆయన రాసిన పాకుడురాళ్ళు, జీవన విజయంపై అందించిన కాదంబరి నవలలు ఆయనకు ఎనలేని పేరుప్రతిష్ఠలు సాధించిపెట్టాయి. ప్రముఖ ఒరియా కవి సీతాకాంత్ మహాపాత్ర నేతృత్వంలోని జ్ఞానపీఠ అవార్డు కమిటీ 2012కి గాను రావూరి భరద్వాజను ఎంపిక చేసింది. భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠం అవార్డు సొంతం చేసుకుంటున్న తొలి తెలుగు వచన రచయిత రావూరి భరద్వాజ. తెలుగులో ఇదివరకు 1970లో జ్ఞానపీఠం సాధించిన విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షం, 1988లో డాక్టర్ సి.నారాయణ రెడ్డి విశ్వంబర ... కవితా వాక్యాలే.భరద్వాజ రచనలు పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా, పరిశోధకులకు ఆధారాలుగా నిలిచాయి. భరద్వాజకు పలు రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు. సోవియట్ ల్యాండ్ అవార్డు, తెలుగు అకాడమీ, బాల సాహిత్య పరిషత్ అవార్డులూ అందుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu