లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి తెలంగాణ సర్వే..

 

తెలంగాణ ప్రభుత్వం ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ ఒక్క రోజులోనే రాష్ట్రమంతటా సర్వే చేయించిన సంగతి తెలిసిందే. 19 ఆగ‌స్టు 2014న‌  ఒకే రోజు 4ల‌క్ష‌ల మంది ఉద్యోగుల సాయంతో 1.09కోట్ల కుటుంబాల‌ను స‌ర్వే చేసింది ప్రభుత్వం. దీనికి గాను ఈ సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో  ఇప్పటివరకు దేశంలో ఇలాంటి స‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని లిమ్కాబుక్ నిర్వాహ‌కులు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించి.. ఈ స‌ర్వేను రికార్డుల్లోకి ఎక్కిస్తున్న‌ట్లు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ను ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu