తెలంగాణ బడ్జెట్ పై ఉత్కంఠ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై అధ్యయనానికి గురువారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలం గాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో యావత్‌ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. తెలంగాణలో ఎలాంటి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారనే దాని పై తెలంగాణ వాదులతో పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్‌ రూపం ఎలా వుంటుందనే దానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.