టీచర్ కేసీఆర్

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా టీచర్ అవతారం ఎత్తనున్నారు. ఎలాగంటారా... మే 1 నుంచి 4 వరకు నాలుగు రోజుల పాటు ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. నాగార్జునసాగర్ దీనికి వేదిక కానుంది. తన పార్టీలోని నాయకులంతా తన లాగే వైబ్రైంట్ గా ఉండాలన్నది కేసీఆర్ సంకల్పమట. తాను ఎంపీగా, ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎదుర్కొన్న అనుభవాలనే పాఠాలుగా చెపుతారంట. కేసీఆర్ తోపాటు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన పలువురు నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ శిక్షణ తరగతులో రాజకీయాలు, ఆర్థిక అంశాలు, బడ్జెట్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వైద్యం ఆరోగ్యం, పంచాయతీరాజ్ ఇలా పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి రెండు రోజులు సుమారు వంద మంది వరకు ప్రతినిధులు, చివరిరోజు జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu