ఈ నెల 30న  తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 30 తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రదానకార్యదర్శి  శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ వేదికగా భేటీ జరుగనుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మిగిలిపోయిన హామీలపై  ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి అమలు చేయనున్న రైతు భరోసాపై చర్చించనున్నారు. ఏడాదికి  ఎకరానికి 15 వేలు భూమిలేని రైతుకు 12 వేల రూపాయలు ఈ పథకం క్రింద ఇవ్వనున్నారు.సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu