తెలంగాణ మంత్రికి మావోయిస్టుల వార్నింగ్

 

తెలంగాణ మంత్రి చందూలాల్ పై మావోయిస్ట్ పోస్టర్లు వెలిశాయి, చందూలాల్ ఎన్ కౌంటర్లను ప్రోత్సహిస్తున్నాడంటూ వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మావోయిస్టులు పోస్టులు వేశారు, కరీంనగర్-ఖమ్మం-వరంగల్ మావోయిస్ట్ కార్యదర్శి దామోదర్ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో మంత్రి చందూలాల్ ను హెచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చారు, ఇటీవల వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో వెలిసిన ఈ పోస్టర్లపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు, కమలాపురం గ్రామంలో పలువురిని పోలీసులు ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే గిరిజన మంత్రి చందూలాల్ ను బెదిరిస్తూ మావోయిస్టు పోస్టర్లు వెలియడంతో వరంగల్ జిల్లాలో కలకలరం రేగుతోంది.