తాజా వ్యూహంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ !

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన తాజా వ్యూహంపై ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం సమావేశమయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. దీనికి రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎంపీలు జి.వివేక్, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు  రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలం పొడగింపు, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు, రాష్ట్ర సాధన కోసం పార్టీ అధినాయకత్వంపై చేయాల్సిన ఒత్తిడి తదితర అంశాలపై కీలకంగా చర్చించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu