టీం ఇండియా కోచ్ రేసులో సెహ్వాగ్..

ప్రస్తుత టీం ఇండియా కోచ్ అనిల్ కుంబ్లే పదవి కాలం ముగుస్తుండటంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది. కుంబ్లేకు మరోసారి అవకాశం ఇవ్వాలని భావించి ఆయనను దరఖాస్తు చేసుకోవాలని సూచించింది అయితే ఆయనకు పోటీగా భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సెహ్వాగ్ కొట్టిపారేశాడు..తనకు బీసీసీఐ నుంచి ఎలాంటి వర్తమానం అందలేదని తెలిపాడు. కొద్ది రోజులు ఆగితే అసలు నిజం తెలుస్తుందన్నాడు. సెహ్వాగ్ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.