టీటీడీపీకి మరో షాక్..టీఆర్ఎస్‌లో చేరనున్న రమేశ్ రాథోడ్

మూలిగే నక్క మీద మీద తాటికాయ పడ్డట్టు..అసలే ఉన్న సీనియర్లంతా దూరమై బండి నెట్టుకొస్తున్న టీటీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత రమేశ్ రాథోడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన రేపు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. రమేశ్‌తో పాటు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రితేశ్ రాథోడ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల టీడీపీ అధ్యక్షులు, పలువురు నాయకులు రేపు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.