కెసిఆర్ పై తెలంగాణా టిడిపి నేతల ధ్వజం

TDP Telangana Forum press conference at TDLP office, TDP Telangana Leaders Fires on KCR, KCR is a Culprit TDP Telangana Leaders

 

ఎన్టీఆర్ భవన్ లో బుధవారం తెలంగాణా టిడిపి నేతలు టిడిపి తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్, శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు, టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమాన్ని గాలికి వదిలేసి ఇతర పార్టీల నాయకుల కోసం వెంపర్లాడుతున్న కెసిఆర్ రాజకీయ వ్యభిచారి అని, లాబీయింగ్ తోనే తెలంగాణా వస్తుందని కొంతకాలం, ఉద్యమం చేస్తేనే తెలంగాణా వస్తుందని మరికొంతకాలం, వంద సీట్లు వస్తేనే తెలంగాణా వస్తుందని కొన్ని రోజులు, తాజాగా ఇప్పుడు పక్క పార్టీలవారికోసం పాకులాడుతున్నాడని ధ్వజమెత్తారు. టిడిపి తెలంగాణాకోసం లేఖ ఇచ్చింది, రాజీనామాలు చేసింది, ఉద్యమాల్లో పాల్గొంది. అయినా కెసిఆర్ టిడిపిని శత్రువుగా చేసి, కాంగ్రెస్ ను కాపాడే ప్రయత్నం చేశారు అని ఎర్రబెల్లి దయాకర్ ఘాటుగా విమర్శించారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ చేతగాని దద్దమ్మలు, చవటలే కెసిఆర్ పంచన చేరుతున్నారు, అచ్చమైన టిడిపి వాడెవడూ చేరట్లేదు, కెసిఆర్ మరోసారి తెలంగాణా ప్రజలను దొరలపాలన కిందకు తీసుకెళ్ళాలని చూస్తున్నాడు, తెలంగాణా వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటున్నాడు కదా మరి గద్దర్ పేరు పకతించాలి లేదా విమలక్క పేరు ప్రకటించాలి, రాష్ట్రంలో కెసిఆర్, వైఎస్ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని, ఒక కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తే మరొక కుటుంబం వేల కోట్లు సంపాదించిందని, ఒకప్పుడు ఇతర పార్టీల నాయకులంటే లెక్కలేనట్టు మాట్లాడిన కెసిఆర్ ఇప్పుడు తన పార్టీలోకి రమ్మని వారి గడపగడపకూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu