టీడీపీలో చేరికలపై పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

 

తెలుగుదేశం పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు.  టీడీపీలోకి ఇతర పార్టీలోకి వస్తామనే వారిపై పార్టీ హైకమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత పార్టీ అనుమతితోనే వారిని తీసుకోవాలని సూచించారు. టీడీపీలో వివిధ హొదాల్లో ఉన్న నాయకులంతా ఈ సూచన పాటించాలని పల్లా తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఇతరులను చేర్చుకునే ముందు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలన్నారు. పార్టీలోకి వస్తామనే వారిపై పూర్తిగా విచారణ చేశాకే ఆహ్వానించాలని చెప్పారు.