'ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ ను ప్రారంభించిన మోడీ..

 

ప్రధాని నరేంద్ర మోడీ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌ లోని బాలియాలో కొద్దిసేపటి క్రితం 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా దేశంలోని 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నట్టు తెలిపారు. పలువురు మహిళలకు స్వయంగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేసిన మోదీ, పేదలందరి జీవితాల్లో వెలుగులను నింపే లక్ష్యంతో తమ ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రకటించనుందని వివరించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుందని తాను నమ్ముతానని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu