కాబూల్‌లో ఆత్మాహుతి దాడులు..24 మంది మృతి

ఆఫ్గానిస్థాన్‌పై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. రాజధాని కాబూల్‌పై వరుస ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడ్డారు. నగరంలోని మురాన్ ఖని వద్ద తొలి పేలుడు సంభవించగా..ఆఫ్గనిస్థాన్ మంత్రిత్వ శాఖ కార్యాలయాల వద్ద మరో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 24 మంది చనిపోగా..30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంత వరకూ ఏ సంస్థ ప్రకటన చేయలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu