తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసు


 

ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ అతని రాజీనామా వ్యవహారం వివాదంలో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు దానికి తోడు అతని కుమారుడు కూడా కొత్తగా వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తుంది. అభినవ్ అనే వ్యక్తి తన భార్యను సాయి కిరణ్ కిడ్నాప్ చేశాడని మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం.. అభినవ్ రెండు నెలల క్రితమే సికింద్రాబాద్ మారేడ్ పల్లికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి తల్లిదండ్రులకు ఈ వివాహం నచ్చకపోవడంతో ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్టు అభినవ్ తెలిపాడు. తన భార్యను తీసుకురావడానికి వెళ్లిన అతనిపై అతని కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో తన భార్య కిడ్నాప్ కు, అతనిపై దాడి వెనుక తలసాని కుమారుడు సాయికిరణ్ హస్తం ఉందని అభినవ్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు తలసాని కొడుకుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.