ఎన్ కౌంటర్ల పై సుప్రీం చీఫ్ జస్టిస్ సెన్సేషనల్ కామెంట్స్..

 

 

దిశ హత్యాచార ఘటన తో దేశం మొత్తం ఏకమై నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని నినదించిన విషయం తెలిసిందే. కారణమేదయినా కానీ దిశ కేసులో నిందితులను నిన్న తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ లో  కాల్చి చంపటం జరిగింది. ఐతే తాజాగా ఇదే విషయమై జోధాపూర్ లో జరిగిన రాజస్థాన్ హైకోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ సుప్రీం చీఫ్ జస్టిస్ మరియు ఇతర సీనియర్ న్యాయమూర్తులకు విజ్నప్తి చేస్తూ అత్యాచారం కేసులను త్వరగా పరిష్కరించాలని కోరారు. దేశంలోని మహళలు తమపై జరగుతున్న హత్యాచార  ఘటనలతో  ఆవేదనతోను,  నిస్పృహలో ఉన్నారని అందువల్ల ఈ తరహా కేసులను త్వరగా పరిష్కరించే విధంగా న్యాయస్థానాలు పని చేయాలనీ అయన విజ్ఞప్తి చేసారు. ఐతే అదే కార్యక్రమం లో పాల్గొన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే  దీని పై స్పందిస్తూ రేప్ కేసుల వెంటనే తీర్పులు చెప్పడం సరి కాదని అన్నారు. ఈ సందర్బంగా నిన్న జరిగిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను పరోక్షంగా  ప్రస్తావిస్తూ న్యాయం అనేది ప్రతీకారంగా మారితే న్యాయం యొక్క రూపు రేఖలు మారిపోతాయని అయన  వ్యాఖ్యానించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu