కష్టాల్లో సుబ్రహ్మణ్యస్వామి.. కేసు విచారణకు అనుమతి..

 

ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ పులువురిని ఇబ్బందుల్లో పెట్టే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు తాను ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన రాసిన ఓ వ్యాసం నేపథ్యంలో పోలీసులు విచారించే పరిస్థితి వచ్చింది. అసలు సంగతేంటంటే.. ఐదేళ్ల నాడు ముంబైకి చెందిన ఓ పత్రికలో దేశంలోని ముస్లింలకు ఓటు హక్కును తొలగించాలని వ్యాసం రాయాలి. ఆయన రాసిన వ్యాసంపై నేషనల్ మైనారిటీ కమిషన్ సెక్షన్ 153-ఏ కింద కేసు నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఈకేసుపై విచారించడానికి ఢిల్లీ పోలీసులకు అనుమతి లభించింది. ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రాగా, జస్టిస్ ఐఎస్ మెహతా వాదనలు విన్నారు. ముసాయిదా చార్జ్ షీట్ తయారైందని పోలీసులు చెప్పడంతో, స్వామిని విచారించేందుకు అనుమతించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu