నడి సముద్రంలో ఆగిన నౌక.. భయంలో 600 మంది
posted on Sep 28, 2016 11:57AM

సాంకేతిక లోపం కారణంగా బంగాళాఖాతంలో అండమాన్ మార్గంలో ప్రయాణికులతో వెళుతున్న నౌక ఒకటి మధ్యలోనే నిలిచిపోయింది. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర కూలీలు విశాఖ పోర్టు నుంచి నౌక ప్రయాణం ద్వారా అండమాన్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖకు 6 నాటికల్ మైళ్ల దూరంలో నౌక నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నౌకలో దాదాపు 600 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే నౌక మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సమస్య పరిష్కారానికి మరో 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని మర్చంట్ నేవీ అధికారులు వెల్లడించారు. నౌక మరమ్మతులు పూర్తయిన తర్వాత కూలీలను తిరిగి విశాఖ తీసుకు రావాలా లేక అదే నౌకలో అండమాన్ పంపాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నేవీ అధికారులు చెప్పారు.