13 మంది ఉసురుతీసిన ఉగ్రదాడి..

 

స్పెయిన్ లో మరోసారి ఉగ్రవాదం పంజా విసిరింది. స్పెయిన్ లోని బార్సిలోనాపై ఉగ్రదాడి జరిగి దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100మందికి పైగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో కొంతమంది పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ఇదిలా ఉండగా... ఈ ఘటన మరువక ముందే మరోసారి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. స్పెయిన్ లోని క్యాంబ్రిల్స్ లో భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు నలుగురు అనుమానిత ఉగ్రవాదులను హతమార్చారు. కాగా  ఐఎస్ఐఎస్ ఉగ్రమూకలే ఈ రెండు ఘటనల వెనుకా ఉన్నాయని అన్నారు. బార్సిలోనా దాడికి పాల్పడిన ఉగ్రవాది చిత్రాన్ని అధికారులు విడుదల చేశారు.