అధ్యక్షురాలిగా ఓటమి బాధ్యత నాదే: సోనియా

 

 

 

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ కు దేశవ్యాప్తంగా మొత్తం మీద సుమారు 60 లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్‌లోని మొత్తం 543 సీట్లుండగా కాంగ్రెస్‌ పార్టీ 498 స్దానాలకు మాత్రమే పోటీ చేయగా అందులో విజయం సాదించింది కేవలం 60 స్దానాల్లోనే. నరేంద్రమోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ దెబ్బకు కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతైపోయింది. అయితే అధ్యక్షురాలిగా పార్టీ ఘోర పరాజయానికి తానే బాధ్యత వహిస్తున్నానని సోనియా గాంధీ తెలిపారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడపే ప్రభుత్వం దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని ఆశిస్తున్నట్లు సోనియాగాంధీ తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు చెప్పారు. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో భాగమేనని, ప్రజల నిర్ణయాన్ని తాము సగౌరవంగా అంగీకరిస్తున్నామని అన్నారు.