తల్లిని నదిలో తోసిన కొడుకు

 

కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఆస్తి కోసం కన్నతల్లిని ఓ పుత్రరత్రం కుందూనదిలోకి తోసేశాడు. తల్లిని నదిలోకి తోసేసిన తర్వాత ఆ కొడుకు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికలు వెంటనే ఆమెని కాపాడారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్తిని తన పేరిట రాయాలని గత కొంత కాలంగా తన కొడుకు వేధిస్తున్నాడని, ఆ క్రమంలో తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ వున్నాయని ఆమె చెప్పింది. అయితే గురువారం ఉదయం పని ఉంది రమ్మంటూ తనను బయటకు తీసుకువచ్చాడని, కుందూనది వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా తనను నదిలోకి తోసేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. ఆమె కొడుకు కోసం పోలీసులు వెతుకుతున్నారు.