అయ్యా మంత్రి గారు కరోనా టైం లో ఇదేం పని సార్

దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతూనే ఉంది. అన్ లాక్ 1 మొదలైన తరువాత అంతకు ముందు లాక్ డౌన్ టైంలో గ్రీన్ జోన్లుగా ఉన్న ప్రాంతాలకు కూడా వైరస్ విస్తరిస్తోంది. భారత్ లో కరోనా కేసులు రెండు లక్షలు దాటేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారం లో ఉన్నవారు మరింత జాగ్రత్త్తగా వ్యవహించవలసిన సమయం ఇది. తాజాగా కర్ణాటక హెల్త్ మినిష్టర్ బి శ్రీరాములు చిత్ర దుర్గ జిల్లా చల్లకేరే తాలూకా పరశురాంపురంలోని దేవాలయాన్ని సందర్శిస్తూ సోషల్ డిస్టెన్స్ అనే మాట మర్చి పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆలయ సందర్శన సందర్బంగా అయన అనుచరులు భారీగా తరలి వచ్చి ఆయనకు ఆపిల్స్ గజమాల తో సత్కరించే ప్రయత్నం చేసారు. ఆ సమయం లో కేరింతలు కొడుతూ ఒకరి మీద ఒకరు పడి పోతూ భౌతిక దూరం అనే మాట మర్చిపోయారు. సామాజిక దూరం పై సామాన్యులను ఎడ్యుకేట్ చేయాల్సిన సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ఇలా వ్యవహరించటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనికి ఫైనల్ టచ్ ఏంటంటే ఆ ప్రోగ్రాం ముగింపులో మంత్రి గారు మళ్ళీ సోషల్ డిస్టెన్స్ గురించి సుద్దులు చెప్పటమే.